నల్లగొండ, నవంబర్ 3:
గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా చిట్యాల రైల్వే బ్రిడ్జి అండర్పాస్ వద్ద వర్షపు నీరు నిల్వతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (IPS) స్వయంగా ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
నేషనల్ హైవే, రెవెన్యూ, ఫైర్, మున్సిపాలిటీ అధికారులతో కలిసి అక్కడ నీరు నిల్వకు గల కారణాలను తెలుసుకున్నారు. వాహన రాకపోకలు సజావుగా సాగేందుకు తాత్కాలిక ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు.
ఈ పరిశీలనలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, నార్కట్పల్లి సీఐ నాగరాజు, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య, మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments