e-paper
Thursday, January 29, 2026

కళ్లకు గంతలు కట్టుకొని వినూత్న నిరసన చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు

పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్ మరియు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ నాయకులు వినూత్న నిరసన నిర్వహించారు.

రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అంబేద్కర్ విగ్రహం ముందు కాళ్లకు గంతలు కట్టి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతిబింబిస్తూ నిరసన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యుడు ఖమ్మంపాటి శంకర్ పాల్గొని మాట్లాడుతూ, నిధుల విడుదలలో జరుగుతున్న ఆలస్యం కారణంగా విద్యార్థులు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

విద్య హక్కును కాపాడే దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసనలో రియాజ్, టిల్, వరుణ్, నాని, వినయ్, శివ, చరణ్, రంజిత్, ఆరిఫ్, ఫహద్, సందీప్, శివ శంకర్, ప్రవీణ్, వరుణ్, మహేష్, ప్రదీప్, రాజేష్, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!