కంది ఉల్లాస్, చీకటి వెలుగు: నల్లగొండ, అక్టోబర్ 31:

సర్దార్ వల్లభభాయి పటేల్ 150వ జయంతి, జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారు జెండా ఊపి 2కె రన్ను ప్రారంభించి, పోలీస్ అధికారులు, సిబ్బంది, యువత, విద్యార్థులు కలిసి సుమారు 500 మంది పాల్గొన్నారు. ఈ రన్ పట్టణంలోని యన్.జి. కళాశాల నుండి క్లాక్ టవర్ వరకు ఉత్సాహంగా కొనసాగింది.
ఈ సందర్భంగా ఎస్పీ గారు సర్దార్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడుతూ—
“దేశ సమైక్యతకు, సంస్థానాల విలీనానికి అహర్నిశలు కృషి చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయి పటేల్ ఆశయాలు మన అందరికీ స్ఫూర్తిగా నిలవాలి,” అని పేర్కొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments