జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రోడ్డు భద్రతను ప్రతి ఒక్కరు వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.
కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మానవ తప్పిదాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసు, ఆర్ అండ్ బి, నేషనల్ హైవే, ఆర్టీసీ వంటి శాఖలు కలిసి పనిచేయాలి అని అన్నారు.
కలెక్టర్ సూచనలు:
ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లు గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలి. స్కూల్ బస్సుల్లో సైడ్ మిర్రర్లు, తప్పనిసరి హెల్పర్ ఉండాలి. అన్ని వాహనాలకు రిఫ్లెక్టివ్ రేడియం స్టిక్కర్లు ఉండాలి. చిట్యాల అండర్పాస్ వద్ద వర్షపు నీరు నిల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలి.
జిల్లా ఎస్పీ శరత్ చందర్ పవార్ మాట్లాడుతూ, ప్రమాదప్రాంతాలను గుర్తించి సంబంధిత శాఖలకు సమాచారం ఇస్తున్నామని, పెట్రోల్ బంకుల వద్ద సర్వీస్ రోడ్లు తప్పనిసరి చేయాలని తెలిపారు. అలాగే, నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్, వైఎస్ఆర్ చౌరస్తా వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్, లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు.

సమావేశంలో రవాణా, ఆరోగ్య, విద్య, ఆర్టీసీ, మున్సిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments