e-paper
Monday, November 3, 2025
spot_imgspot_imgspot_img

ఉద్యోగ విరమణ ప్రతి ఉద్యోగికి సహజం – మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ సహజమని, విధి నిర్వహణలో చేసిన సేవలు ఉద్యోగికి తగిన గుర్తింపునిస్తాయని మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు.

పజ్జూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సమగ్ర శిక్ష అభియాన్ ఇన్‌ఛార్జ్ చోల్లేటి యోగేంద్రనాథ్ రిటైర్మెంట్ సన్మాన కార్యక్రమం ఆదివారం స్థానిక చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, యోగేంద్రనాథ్‌ను పుష్పగుచ్ఛం, షాల్‌తో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నర్సిరెడ్డి గారు —

యోగేంద్రనాథ్ తన బాధ్యతలను నిబద్ధతతో, ఎటువంటి రీమార్క్ లేకుండా నిర్వహించారని, విద్యార్థుల భవిష్యత్తు కోసం నిస్వార్థంగా పనిచేశారని ప్రశంసించారు.

అలాగే, టీఎస్ యుటిఎఫ్ సభ్యునిగా సంఘం బలోపేతానికి కృషి చేశారని తెలిపారు.

కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కేక్ కట్ చేసి ఆనందం పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, నార్మల్ మాజీ చైర్మన్ జితేందర్ రెడ్డి, టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి, జిల్లా అధ్యక్షుడు తిరుమల వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు రాజశేఖర్ రెడ్డి, కొమ్ము శ్రీను, ఎడ్ల సైదులు, నర్రా శేఖర్ రెడ్డి, జాన్ రెడ్డి,

వివిధ సంఘాల ఉపాధ్యాయులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!