సౌత్ ఇండియన్ మీడియా అసోసియేషన్ (సైమా) ఆధ్వర్యంలో శనివారం బెంగళూరులోని మాల్ ఆఫ్ ఏసియాలో సైమా అవార్డ్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లాకు చెందిన సాక్షి సీనియర్ ఫోటో జర్నలిస్ట్ కంది భజరంగ్ ప్రసాద్కు ఈ కార్యక్రమంలో అవార్డు అందజేయడం జరిగింది. అవార్డును కర్ణాటక రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి హెచ్. మునియప్ప, కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాట్, తమిళనాడు శివగంగ పార్లమెంట్ సభ్యుడు కార్తీ చిదంబరం, చిత్రదుర్గ బువి మఠం సిద్ధి రామేశ్వర స్వామీ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో బెంగళూరు ప్రెస్ క్లబ్ కార్యదర్శి శివకుమార్ బెల్లి తట్టే, సైమా అధ్యక్షుడు ఆదినారాయణమూర్తి, జనరల్ సెక్రటరీ ఎన్ కె స్వామి తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments