e-paper
Thursday, January 29, 2026

“ప్రభుత్వం రైతుల వెంటే ఉంది” – ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ భరోసా

కృష్ణా జిల్లా కోడూరు మండలంలో తుపాను ప్రభావిత ప్రాంతాలను ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా సందర్శించారు. తుఫాను కారణంగా వరి పంటలు దెబ్బతిన్న పొలాలను పరిశీలిస్తూ, రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడారు.

పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ –

“ప్రభుత్వం రైతుల వెంటే ఉంది. తుపాను వల్ల జరిగిన నష్టాన్ని పూర్తిగా అంచనా వేసి, తగిన పరిహారం అందించే చర్యలు తీసుకుంటాం,” అని హామీ ఇచ్చారు.

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆర్డీవో, కమిషనర్ గుత్తా వెంకటరామిరెడ్డి, ఇరిగేషన్‌ డీఈఈ, మున్సిపల్‌ ఏఈ, సర్వే సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు.

రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ, పంటలు నీటమునిగిపోవడంతో భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ వారిని ధైర్యపరుస్తూ, ప్రభుత్వం తక్షణ సహాయం అందిస్తుందని చెప్పారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!