హైదరాబాద్ / జగిత్యాల:
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జనవరి 3న ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కుటుంబ సమేతంగా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
దర్శనం అనంతరం, టీటీడీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సత్రాలు, మౌలిక సదుపాయాలు మరియు ఇతర అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. కొండగట్టు క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments