e-paper
Thursday, January 29, 2026

ఒస్మానియా యూనివర్సిటీలో బీసీ దీక్ష ముగింపు — రిజర్వేషన్లలో వర్గీకరణ అవసరమని డిమాండ్

హైదరాబాద్ ‌, నవంబర్‌ 6:
ఒస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజ్‌ ముందు కొనసాగిన బీసీ దీక్ష ఈరోజుతో ముగిసింది. ఈ దీక్షకు కొమ్మనవోయినా సైదులు అధ్యక్షత వహించగా, డాక్టర్‌ జంపాల రాజేష్‌ ఆధ్వర్యంలో మూడవ రోజుకు చేరుకున్న ఈ కార్యక్రమం ముగిసింది.

నాయి బ్రాహ్మణ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మరియు బీసీ విద్యార్ధి JAC వైస్‌ చైర్మన్‌ వెంకట్‌ తిమ్మనగరం మాట్లాడుతూ, బీసీలకు రిజర్వేషన్లు ఎంత అవసరమో, రిజర్వేషన్లలో ఏబీసీడి వర్గీకరణ కూడా అంతే అవసరమని పేర్కొన్నారు. బీసీ వర్గీకరణను తక్షణం అమలు చేయాలని కుల సంఘం తరఫున ఆయన డిమాండ్‌ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ ఆర్‌. కృష్ణయ్య, గుజ్జ సత్యం, క్రాంతి దళ్‌ పృథ్వీరాజ్‌, దాసు సురేష్, తెలంగాణ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ నాయకులు భూషణ్‌, బాలు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. వివిధ విద్యార్థి సంఘాల నాయకులు కూడా హాజరై బీసీ వర్గీకరణకు మద్దతు తెలిపారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!