15 మంది నిందితుల అరెస్టు – 9 మంది పరారీ
₹3.90 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి**
జనగామ / యాదాద్రి:
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్ల కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జనగామ, యాదాద్రి–భువనగిరి జిల్లాల్లో జరిగిన రూ.3.90 కోట్ల ప్రభుత్వ ఆదాయ నష్టానికి సంబంధించిన కేసులో మొత్తం ముఠాకు చెందిన 15 మంది నిందితులను జనగామ పోలీసులు అరెస్టు చేయగా, మరో 9 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితుల నుంచి పోలీసులు రూ.63.19 లక్షల నగదు, బ్యాంకులో రూ.1 లక్ష, సుమారు రూ.1 కోటి విలువైన ఆస్తి పత్రాలు, ఒక కారు, రెండు ల్యాప్టాప్లు, ఐదు డెస్క్టాప్ కంప్యూటర్లు, 17 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన నిందితులు:
పసునూరి బసవ రాజు (32) – యాదాద్రి జిల్లా జెల్లా పాండు (46) – యాదాద్రి జిల్లా మహేశ్వరం గణేష్ కుమార్ (39) – యాదాద్రి జిల్లా ఈగజులపాటి శ్రీనాథ్ (35) – జనగామ యెనగంధుల వెంకటేష్ – జనగామ కోదురి శ్రావణ్ (35) – జనగామ కొలిపాక సతీష్ కుమార్ (36) – కొడకండ్ల (మం), జనగామ తడూరి రంజిత్ కుమార్ (39) – నర్మెట్ట, జనగామ దుంపల కిషన్ రెడ్డి (29) – ఆత్మకూర్ (మం), యాదాద్రి జిల్లా దశరథ్ మేఘావత్ (28) – తురుపల్లి నారా భాను ప్రసాద్ (30) – యాదగిరిగుట్ట గొపగాను శ్రీనాథ్ (32), శివకుమార్ (33) – అమంగల్, నల్లగొండ అలేటి నాగరాజు (32) – యాదాద్రి జిల్లా (ఇతర నిందితుల వివరాలు పోలీసుల పరిశీలనలో ఉన్నాయి.)
మోసానికి ఉపయోగించిన పద్ధతి
వరంగల్ పోలీస్ కమిషనర్ సస్క్రీప్రీత్ సింగ్ వివరాల ప్రకారం, ప్రధాన నిందితులైన పసునూరి బసవ రాజు, జెల్లా పాండు యాదగిరిగుట్టలో ఆన్లైన్ సర్వీస్ సెంటర్లను నిర్వహించేవారు. రైతుల నుంచి రిజిస్ట్రేషన్ రుసుములను పూర్తిగా వసూలు చేసి, ధరణి/భూభారతి వెబ్సైట్లో ‘ఎడిట్ అప్లికేషన్’ను ఉపయోగించి చలానా మొత్తాలను తగ్గించి, నకిలీ రసీదులను తయారు చేసేవారు.
మొబైల్ అప్లికేషన్ల ద్వారా ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుమును తక్కువగా చూపిస్తూ నకిలీ చలాన్లను తయారు చేసి, వాటిని మద్యవర్తుల ద్వారా ఎంఆర్ఓలు, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సమర్పించడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రక్రియలో మధ్యవర్తులకు 10 నుంచి 30 శాతం వరకు కమిషన్ చెల్లించేవారని వెల్లడించారు.
కేసుల వివరాలు
ఈ కుంభకోణానికి సంబంధించి జనగామ, యాదాద్రి జిల్లాల్లో 1,080 రిజిస్ట్రేషన్ పత్రాల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. మొత్తం 22 కేసులు నమోదు కాగా, అందులో జనగామ జిల్లాలో 7 కేసులు, యాదాద్రి జిల్లాలో 15 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
అభినందనలు
ఈ ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండరి చేతన్, జనగామ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి, రఘునాథ్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర ఎస్ఐలు, సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments