గాంధీ సంస్థల ముఖ్య సలహాదారు మారం గోనారెడ్డి పిలుపు
గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడు తేదీన నల్గొండ జిల్లా నకరికల్ పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు గాంధీ సంస్థల ముఖ్య సలహాదారు మారం గోనారెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు, స్వదేశీ మేళా, జాతీయ రైతు దినోత్సవ వేడుకలను ఒకేసారి నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తెలియజేయడానికి నల్గొండ పట్టణంలోని మైత్రి అకాడమీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మారం గోనారెడ్డి మాట్లాడారు.
ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల పరిధిలోని అన్ని జిల్లాల నుంచి ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం చేస్తున్న ఉత్తమ రైతులను గుర్తించి వారికి “పుడమిపుత్ర అవార్డులు” ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. అలాగే వ్యవసాయ అనుబంధ రంగాల్లో విశిష్ట కృషి చేస్తున్న వ్యక్తులను కూడా గుర్తించి అవార్డులు బహుకరించే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ వేడుకలు రైతులకు ప్రేరణనిచ్చేలా, వ్యవసాయ రంగానికి సరైన దిశానిర్దేశం చేసేలా ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో గాంధీ సంస్థల ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి, మైత్రి అకాడమీ చైర్మన్ పాముల అశోక్ ముదిరాజ్, ట్రస్మా జిల్లా కార్యదర్శి జీ వి రావు, పిఆర్టియు తెలంగాణ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు, ప్రముఖ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ నందగోపాల్ రాయల, ప్రముఖ యోగ మాస్టర్ జినుగు జ్యోతి వెంకటరెడ్డి, జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జవహర్ లాల్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ జాతీయ రైతు దినోత్సవ వేడుకల్లో రైతులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments