నల్గొండ జిల్లా చందనపల్లి సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతుండగా TVS ద్విచక్రవాహనాన్ని స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో TVSపై ప్రయాణిస్తున్న వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అత్యవసర సేవలకు సమాచారం అందించారు. కట్టంగూర్ నుంచి 108 అంబులెన్స్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుంది. అంబులెన్స్ సిబ్బంది అక్కడికక్కడే గాయపడిన వృద్ధుడికి ప్రథమ చికిత్స అందించారు.
తర్వాత ఆయన్ను నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. గాయపడిన వృద్ధుడు నల్గొండ జిల్లా పెద్ద సూరారం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments