ఈనెల 24న ఉమ్మడి నల్లగొండ జిల్లా అర్చక ఉద్యోగుల సంఘం నూతన కమిటీ ఎన్నికలు ధర్వేశిపురం రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం సమీపంలోని కూసం ఉపేందర్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నట్లు అర్చక ఉద్యోగుల వెల్ఫేర్ బోర్డు కమిటీ మెంబర్ సిహెచ్ శ్రవణ్ కుమారాచార్యులు తెలిపారు. శనివారం స్థానిక తులసీ నగర్ ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి అర్చక ఉద్యోగుల సంఘం రాష్ట్ర చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ డివిఆర్ శర్మ, ధూప దీప అర్చక సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు పెన్నా మోహన శర్మ పాల్గొననున్నట్లు తెలిపారు. రాష్ట్ర నాయకుల సమక్షంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా సంఘం ఎన్నికలు నిర్వహించనున్నామని సమావేశానికి జిల్లాలోని అర్చక ఉద్యోగ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments