నల్గొండ పట్టణంలోని రవీందర్నగర్లో ఉన్న బీసీఈ హాస్టల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. డిగ్రీ తుదివర్షం చదువుతున్న శృతి అనే విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఉన్నత చదువులు కొనసాగించాలని కలలుకన్న శృతి, ఇంట్లో జరుగుతున్న పెళ్లి ఏర్పాట్ల వల్ల తీవ్ర మనస్తాపానికి గురైందని స్థానికులు, సహ విద్యార్థినులు తెలిపారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఆమె తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువ విద్యార్థిని అకస్మిక మరణంతో హాస్టల్ పరిసరాలు, సహచర విద్యార్థులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments