నల్గొండలోని భాస్కర్ టాకీస్ సమీపంలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి పూలమాల వేసి వినమ్రంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ—
“సమాజంలో సమానత్వం, న్యాయం, స్వాభిమానానికి మార్గదర్శకుడైన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన చూపిన రాజ్యాంగపథంలో నడిచే ప్రతీ భారతీయుడు దేశ అభివృద్ధికి తన వంతు బాధ్యతగా భావించాలి. అంబేద్కర్ ఆలోచనలు, విలువలు దేశాన్ని ముందుకు నడిపించే శక్తి. ఆయన వర్ధంతి సందర్భంగా, ఆయన స్వప్నించిన సమాజ నిర్మాణానికి మా అంకితభావాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాము.”
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments