e-paper
Thursday, January 29, 2026

ఘనంగా ఎయిడ్స్ దినోత్సవం

స్థానిక డిఎంహెచ్ఓ కార్యాలయంలో సోమవారం ఎయిడ్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు డిఎంహెచ్వో పుట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో గత 15 సంవత్సరాల నుండి పాజిటివ్ రేటు 9 శాతం నుండి 0.48 శాతం వరకు తగ్గించడం జరిగిందని, 367 మంది కి ఎయిడ్స్ పరీక్షలు నిర్వహించి 174 మంది ఎయిడ్స్ ఉన్నట్లుగా గుర్తించి మందులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 7 724 హెచ్ఐవి బాధితులకు క్రమం తప్పకుండా మందులు ఇస్తున్నట్లు తెలిపారు.అలాగే 2521 మందికి అసరా పెన్షన్ ఇప్పించామని ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉచిత పరీక్షలు జరుగుతున్నట్లు తెలిపారు. గత ఏప్రిల్ 2025 నుండి అక్టోబర్ 2025 వరకు 21 మంది గర్భిణీలను గుర్తించి వారికి మందులు ఇస్తున్నామని, 28 మందికి,పాజిటివ్ డెలివరీ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 5738 మంది సెక్స్ వర్కర్స్,,2082 మంది స్వలింగ సంపర్కులు, 229 మంది లింగమార్పిడిదారులను గుర్తించి వారికి ప్రతినెల, మూడు నెలలకు,ఒకసారి ఆరోగ్యపరీక్షలు హెచ్ఐవి పరీక్షలు నిర్వహించి వ్యాధి చూడకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి అవార్డులు ప్రశంస పత్రాలు అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రవీణ, లెప్రసీ అండ్ ఎయిడ్స్ డాక్టర్ పుల్లారావు, డాక్టర్ డి ఐ ఓ డా తిరుపతిరావు డెమో,సంజీవ్ ప్రోగ్రాం మేనేజర్ సంపత్ అయ్యా ప్రేమ్ నాథ్,వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!