నల్లగొండ: రాబోయే నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని డివిజన్లలో పోటీ చేయడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉందని పార్టీ జాయింట్ నల్లగొండ జిల్లా ఇన్చార్జి మేకల సతీష్ రెడ్డి తెలిపారు.
నల్లగొండలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో, ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్న అభ్యర్థులకు ఆయన దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు.
రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన పార్టీ మరింత క్రియాశీలకంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments