e-paper
Wednesday, January 28, 2026

35వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా మిరియాల నాగమణి వెంకటేశం నామినేషన్

నల్లగొండ: నల్లగొండ నగరపాలక సంస్థ ఎన్నికల్లో 35వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా మిరియాల నాగమణి వెంకటేశం అధికారికంగా నామినేషన్ పత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ, గతంలో కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా 35వ వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. వార్డులో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, కేంద్ర జల్ జీవన్ మిషన్ ద్వారా రక్షిత తాగునీటి సరఫరా, మున్సిపల్ పార్కుల అభివృద్ధి, పట్టణ పారిశుభ్రత వంటి పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలులోకి వచ్చాయని పేర్కొన్నారు.

అలాగే కరోనా కాలం నుంచి ఇప్పటివరకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ బియ్యం అందజేస్తోందని, ప్రజల సామాజిక భద్రత కోసం రూ.12కే ప్రమాద బీమా, రూ.330కే అటల్ బిహారీ వాజపేయి బీమా పథకం అందుబాటులో ఉంచిందని తెలిపారు.

నల్లగొండ నగరంలో రైల్వే స్టేషన్ అభివృద్ధి, నల్లగొండ బైపాస్ రోడ్డు నిర్మాణం, ఫుట్‌పాత్‌లు, బ్రిడ్జిల నిర్మాణం వంటి కీలక మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని వారు గుర్తు చేశారు.

నల్లగొండ పట్టణం మున్సిపాలిటీ నుంచి నగరపాలక సంస్థగా అప్‌గ్రేడ్ కావడంలో కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో ఉందని, నగర అభివృద్ధికి తోడ్పడినందుకు నగర ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, రాబోయే నగరపాలక సంస్థ ఎన్నికల్లో అన్ని డివిజన్లలో భారతీయ జనతా పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను పేరుపేరునా విజ్ఞప్తి చేస్తున్నట్లు బీజేపీ నల్లగొండ పట్టణ శాఖ పేర్కొంది.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!