జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర అధ్యక్షుడు డి వి నరేందర్ నాయీ
హైదరాబాద్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం చిక్కడపల్లి నాయీ బ్రాహ్మణ సేవా సంఘం కార్యాలయం వద్ద రాష్ట్ర అధ్యక్షుడు డి వి నరేందర్ నాయీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం చిక్కడపల్లి కళ్యాణ మండపం అభివృద్ధి కొరకు 20 మందితో ఒక కమిటీని వేశారు. ఈ కమిటికి అధ్యక్షుడు గా కంది సూర్యనారాయణని ఎన్నుకున్నారు. అనంతరం నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి వి నరేందర్ నాయీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి పూల మాలలతో పలువురు సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయీ బ్రాహ్మణ నాయకులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments