ప్యాంక్రియాస్ (అగ్నాశయం) తల భాగంలో ఏర్పడిన గడ్డ కారణంగా అబ్స్ట్రక్టివ్ జాండీస్తో బాధపడుతున్న రోగి ప్రాణాలను మలక్పేట యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య బృందం అత్యంత క్లిష్టమైన విపుల్ (Whipple’s) శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా కాపాడింది.
నల్గొండ జిల్లా షాపల్లెకు చెందిన శ్రీ కె. ఉపేందర్ (48) ఒక వారం రోజులుగా కళ్లలో పసుపు రంగు కనిపించడంతో 06-09-2025న యశోదా ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల్లో ప్యాంక్రియాస్ తల భాగంలో పెద్ద గడ్డ పిత్తనాళాన్ని అడ్డుకోవడంతో అబ్స్ట్రక్టివ్ జాండీస్ ఏర్పడినట్లు నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే రోగికి టైప్-2 డయాబెటిస్, హైపర్టెన్షన్, శ్వాస సమస్యలు ఉండటంతో కేసు మరింత క్లిష్టంగా మారింది.
సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆంకాలజీ, అనస్తీషియా, క్రిటికల్ కేర్ విభాగాల వైద్యులు కలిసి చర్చించిన అనంతరం, విపుల్ శస్త్రచికిత్సే ఏకైక పరిష్కారమని నిర్ణయించారు. జనరల్ అనస్తీషియా కింద నిర్వహించిన ఈ శస్త్రచికిత్సలో ప్యాంక్రియాస్ తల భాగంలోని గడ్డతో పాటు ప్రభావిత పిత్తనాళాన్ని తొలగించి, జీర్ణనాళాల పునర్నిర్మాణం చేశారు.
శస్త్రచికిత్స అనంతరం ఐసీయూలో సన్నిహిత పర్యవేక్షణలో ఉంచిన రోగికి వెంటిలేటర్ సహాయం, ఆక్సిజన్, యాంటీబయోటిక్స్, పోషకాహార సహాయం అందించారు. అన్ని సవాళ్లను అధిగమిస్తూ రోగి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడగా, 16-09-2025న స్థిరమైన పరిస్థితిలో డిశ్చార్జ్ చేశారు.
ఈ శస్త్రచికిత్సపై డా. వెంకటేశ్ శ్రీపతి, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మాట్లాడుతూ, “విపుల్ విధానం అత్యంత క్లిష్టమైన, అధిక ప్రమాద శస్త్రచికిత్స. విభాగాల మధ్య సమన్వయంతో ఈ కేసును విజయవంతంగా నిర్వహించగలిగాం” అని తెలిపారు.
యశోదా ఆసుపత్రి యాజమాన్యం స్పందిస్తూ, అత్యాధునిక శస్త్రచికిత్స సదుపాయాలు, అనుభవజ్ఞులైన వైద్యులు, 24/7 ఐసీయూ, క్రిటికల్ కేర్ సేవలతో అత్యంత క్లిష్టమైన ప్యాంక్రియాస్ మరియు గ్యాస్ట్రోఇంటెస్టైనల్ అత్యవసర కేసులను సమర్థంగా నిర్వహించే సామర్థ్యం యశోదా హాస్పిటల్స్కు ఉందని అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిదుర తెలిపారు.
📞 మరిన్ని వివరాలకు:
ఎ. వాసుకిరణ్ రెడ్డి – 97057 71230 / 99499 98378
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments