e-paper
Thursday, January 29, 2026

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్‌గా బి. శరత్ చంద్ర బాధ్యతలు స్వీకరణ

నల్గొండ:

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌కు నూతన కమిషనర్‌గా బి. శరత్ చంద్ర అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా నూతన కమిషనర్ బి. శరత్ చంద్ర మాట్లాడుతూ, గౌరవనీయులైన మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి మార్గదర్శకాలు మరియు సూచనల ప్రకారం నల్గొండ పట్టణ అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని నల్గొండ పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ప్రధానంగా నల్గొండ పట్టణంలో తాగునీటి సరఫరాకు సంబంధించిన సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించడం, ప్రతి వార్డులో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరచడం, అలాగే పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని కమిషనర్ తెలిపారు.

అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందిస్తామని స్పష్టం చేశారు. మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా నల్గొండ పట్టణాన్ని సుస్థిర అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు అన్ని చర్యలు చేపడతామని ఆయన అన్నారు.

నూతన కమిషనర్ నాయకత్వంలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా కొనసాగుతాయని అధికారులు, సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేశారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!