హైదరాబాద్లో కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్ రెడ్డి సమావేశం**
హైదరాబాద్:
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జిలతో కేటీఆర్, హరీష్ రావు, గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా స్థాయి నేతలు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

సమావేశంలో మున్సిపల్ ఎన్నికల వ్యూహాలు, పార్టీ బలోపేతం, నియోజకవర్గ స్థాయిలో సమన్వయం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. కార్యకర్తల సమీకరణ, ప్రజల్లోకి పార్టీ కార్యక్రమాలను బలంగా తీసుకెళ్లడం, ఐక్యతతో ఎన్నికలను ఎదుర్కోవాలని నేతలు సూచించారు.
రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సంస్థాగతంగా బలపడుతూ, ప్రతి నియోజకవర్గంలో పటిష్ట కార్యాచరణ రూపొందించాలని నేతలు పిలుపునిచ్చారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments