దళిత గిరిజనులకు చెందిన స్మశాన వాటికలో అక్రమంగా మట్టిని తోడుతున్న దానిని నిలుపుదల చేసి కాంట్రాక్టర్ పై సెట్టరీ చార్జర్ తీసుకొని న్యాయం చేయాలని పట్టణంలోని మూడో వార్డుకు చెందిన శేషమ్మ గూడెం ఎస్టీ కాలనీ దళిత గిరిజనులు జిల్లా అధికారులను కోరారు. గిరిజన దళిత ఎస్సీ మాల మాదిగ ఎరుకల కులాలకు చెందిన స్మశాన వాటికలో కాకుండా జెసిబి లతో అక్రమంగా తవ్వకాలు జరిపి మట్టిని తరలించడం, తవ్వకాలు నిలిపివేయాలని జెసిబి లకు అడ్డంగా కూర్చుని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా స్మశాన వాటికలో గత 30 సంవత్సరాలు అంత్యక్రియలు నిర్వహించి ఇక్కడనే సమాధి చేయడం సంవత్సరాలుగా ఈ స్మశాన వాటిక యందు సమాధి చేయడం జరిగిందని, చుట్టు ఫినిషింగ్ ఏర్పాటు చేసి ఎవరు చనిపోయిన ఇక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని, కొంతమంది అక్రమంగా రాత్రి సమయంలో మట్టిని తవ్వుతూ వాటిని తరలిస్తూ ఉన్నారని వారిని ప్రశ్నించగా వెళ్లిపోయి రాత్రి, తెల్లవారుజామున వచ్చి యధావిధిగా తవ్వకాలు జరుపుతున్నారని తెలిపారు. వారిని ప్రశ్నించగా తమపైన కేసులు బనాయించి భయాందోళనలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి తమ స్మశాన వాటికలో అక్రమ తవ్వకాలు నిలిపేసి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు ఈ కార్యక్రమంలో అశోక్ కుమార్, నగేష్, రాములు ,రామచంద్రం మహిళలు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments