నల్లగొండ–హైదరాబాద్ రోడ్డులో పేరుగాంచిన శ్రీ ప్రసాద్ ఉడిపి హోటల్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. హోటల్లో కస్టమర్కు వడ్డించిన సాంబార్లో జెర్రీ (బల్లి) కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది.
“ఇదేంటయ్యా… సాంబార్లో జెర్రీ వచ్చింది” అంటూ కస్టమర్ ప్రశ్నించగా, ఒక్కసారిగా హోటల్ సిబ్బంది కంగుతిన్నట్లు సమాచారం.
ఈ విషయాన్ని “మా బాస్కి చూపిస్తాం” అంటూ సాంబార్ను లోపలికి తీసుకెళ్లిన సిబ్బంది, కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చి విషయం బయటకు రాకుండా సాంబార్ను పారేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నల్లగొండలో పేరొందిన హోటల్లో ఈ తరహా ఘటన జరగడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదేనా కస్టమర్లకు ఇచ్చే విలువ? అంటూ ఆహార ప్రియులు ప్రశ్నిస్తున్నారు.
శ్రీ ప్రసాద్ ఉడిపి హోటల్లో నాణ్యత, పరిశుభ్రతపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారుల తక్షణ తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments