e-paper
Thursday, January 29, 2026

నల్గొండ: 1.5 కిలోల ట్యూమర్‌ను విజయవంతంగా తొలగించిన వైద్య బృందం

నల్గొండ: నల్గొండ జనరల్ ఆసుపత్రిలోని మాతా–శిశు విభాగం వైద్యులు 1.5 కిలోల బరువున్న ట్యూమర్‌ను విజయవంతంగా తొలగించారు.

వేములపల్లి మండలం మంగాపురం గ్రామానికి చెందిన లక్ష్మి గత 20 రోజులుగా కడుపునొప్పితో బాధపడుతూ నల్గొండ జనరల్ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఆమె కడుపులో భారీ ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు.

తదనంతరం శస్త్రచికిత్స నిర్వహించి, ట్యూమర్ ఉన్న గర్భాశయాన్ని పూర్తిగా తొలగించారు. తొలగించిన ట్యూమర్ బరువు సుమారు 1.5 కిలోలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

ఈ శస్త్రచికిత్సను డాక్టర్లు స్వరూప్ రాణి, విద్యా భార్గవి, లావణ్య, నిఖిత, ప్రఖ్య నిర్వహించగా, అనస్థీషియా విభాగం నుంచి నేహా, శ్వేత, నర్సింగ్ బృందం కీలక సహకారం అందించింది. సమయోచితంగా చికిత్స అందించి ప్రాణాలను కాపాడిన వైద్య బృందాన్ని ఆసుపత్రి అధికారులు అభినందించారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!