e-paper
Thursday, January 29, 2026

భారత జాతిని మేల్కొలిపిన వైతాళికుడు,

హైందవ ధర్మ ఔన్నత్యాన్ని ప్రపంచ పటంపై గర్వంగా నిలిపిన ధార్మికుడు,

దేశమే దేహంగా జీవించిన మహానుభావుడు — స్వామి వివేకానంద.

అటువంటి మహనీయుడి జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని వీటి కాలనీలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వివేకానంద ఆశయాలను స్మరించుకున్నారు.

స్వామి వివేకానంద బోధనలు నేటి యువతకు మార్గదర్శకమని, దేశ సేవనే పరమ లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!