e-paper
Thursday, January 29, 2026

ప్రభుత్వ ఆసుపత్రుల కార్మికుల సమస్యలను టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్‌కు వినతిపత్రం

హైదరాబాద్:

ఈ రోజు హైదరాబాద్ అసెంబ్లీ ప్రాంగణంలో టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్‌గా నియమితులైన కవ్వంపల్లి సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిసి, తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు, పేషెంట్ కేర్ వర్కర్లు, సానిటేషన్ వర్కర్లు, సూపర్వైజర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కార్మికులు చాలీచాలని జీతాలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం కొనసాగిస్తున్నారని, విధి నిర్వహణలో భాగంగా డ్యూటీలకు వెళ్లే సమయంలో మరియు తిరిగివచ్చే సమయంలో జరుగుతున్న ప్రమాదాల కారణంగా అనారోగ్యాలకు గురవుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో

SPS రాష్ట్ర కమిటీ అధ్యక్షులు – K. సైదయ్య,

రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి – నరేష్,

రాష్ట్ర కమిటీ సభ్యులు – మాతంగి అనిల్ కుమార్,

కోటి, రేణుక, వెంకటేష్‌లతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్మికులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!