నిరుపయోగంగా పడి ఉన్న కియోస్క్లు, పబ్లిక్ టాయిలెట్ కంటైనర్లు – ప్రభుత్వానికి బీజేపీ డిమాండ్
నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని టౌన్ హాల్ ప్రాంగణంలో చిరు వ్యాపారుల కోసం ఏర్పాటు చేసిన కియోస్క్లు (డబ్బాలు) మరియు పబ్లిక్ టాయిలెట్లకు సంబంధించిన మరుగుదొడ్ల కంటైనర్లు నిరుపయోగంగా పడి ఉండడాన్ని భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సందర్శించి పరిశీలించారు.

ఒక్కో కియోస్క్ విలువ సుమారు రూ.2,70,000 కాగా, మొత్తం 28 కియోస్క్లు మరియు పబ్లిక్ టాయిలెట్ కంటైనర్లు టౌన్ హాల్లో వాడుక లేకుండా ఉన్నాయి. వీటి మొత్తం విలువ కోటి రూపాయలకు మించుతుండగా, నల్లగొండలోని కొందరు నాయకుల స్వార్థ రాజకీయాల కారణంగా ప్రజాధనం వృథా అవుతోందని బీజేపీ ఆరోపించింది.
వీధి వ్యాపారులు, పేద వర్గాలకు ఉపయోగపడాల్సిన ఈ కియోస్క్లను వినియోగంలోకి తీసుకురాకుండా నిర్లక్ష్యం చేయడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, రోడ్డు వెంబడి చిరు వ్యాపారం చేసుకునే అర్హులైన పేద ప్రజలకు ఈ డబ్బాలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు డా. నాగం వర్షిత్ రెడ్డి పాల్గొనగా, పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ప్రజల హితాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని కోరింది.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments