e-paper
Thursday, January 29, 2026

రానున్న సంక్రాంతి సెలవుల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్

రాబోయే సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా జిల్లా ప్రజలు తమ స్వగ్రామాలకు, ఇతర పట్టణాలు మరియు దూర ప్రాంతాలకు ప్రయాణం చేయనున్న నేపథ్యంలో, ఇళ్లకు తాళం వేసి వెళ్లే సందర్భాల్లో దొంగతనాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, సంక్రాంతి పండుగలను దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా 24 గంటల పాటు నిరంతర పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. రద్దీ ప్రాంతాలు, నిర్మానుష్య ప్రాంతాలు, ముఖ్యమైన ప్రభుత్వ మరియు ప్రైవేట్ భవనాలు, ఆర్థిక సంస్థలు, అపార్ట్మెంట్లు, కాలనీల వద్ద పోలీస్ సిబ్బంది సందర్శిస్తూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని వెల్లడించారు. పండుగల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు చర్యలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

దొంగతనాల నివారణకు పోలీస్ శాఖ ప్రజలకు ఈ క్రింది సూచనలు చేస్తోంది :

  • ఇంటికి తాళం వేసి వెళ్లే ముందు తలుపులు, కిటికీలు సరిగా మూసివేశామా లేదా అని నిర్ధారించుకోవాలి.
  • బంగారు, వెండి ఆభరణాలు, నగదు, ముఖ్యమైన పత్రాలను ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్‌లో లేదా విశ్వసనీయ వ్యక్తుల వద్ద భద్రపరచుకోవాలి.
  • ఇల్లు ఖాళీగా ఉందని అనుమానం రాకుండా టైమర్ లైట్లు ఏర్పాటు చేయాలి లేదా రాత్రివేళ కనీసం ఒక గదిలో లైట్ వెలిగేలా చూడాలి.
  • ఇంటి ముందు పత్రికలు, పాలు, పార్సెల్స్ పేరుకుపోకుండా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి.
  • సీసీటీవీ కెమెరాలు, అలారం సిస్టమ్స్ ఏర్పాటు చేయడం ద్వారా భద్రత మరింత మెరుగుపడుతుంది.
  • సోషల్ మీడియాలో “ఊరికి వెళ్లాం”, “ఇంట్లో లేను” వంటి వివరాలను బహిరంగంగా పోస్ట్ చేయడం నివారించాలి.
  • పొరుగువారితో సమన్వయం కలిగి పరస్పరంగా ఇళ్లపై నిఘా ఉంచుకునేలా సహకరించాలి.
  • తాళాలను తలుపుల దగ్గర, పూల కుండీలలో లేదా మ్యాట్స్ కింద దాచిపెట్టకూడదు.
  • పనిమనుషులు, డ్రైవర్లు, అపరిచితుల వివరాలను సరిగా పరిశీలించి మాత్రమే ఇంట్లోకి అనుమతించాలి.
  • ఇంటి చుట్టూ ఉన్న పొదలు, చెట్లు కత్తిరించి స్పష్టమైన విజిబిలిటీ ఉండేలా చూడాలి.
  • మెయిన్ గేట్ లేదా ఇంటి ముందు సెన్సార్ లైట్లు ఏర్పాటు చేయడం ద్వారా అనవసర ప్రవేశాలను అడ్డుకోవచ్చు.
  • ఇంటి ముందు లేదా ఇంట్లోకి వెళ్లే దారుల్లో వాహనాలను ఎక్కువ రోజులు నిలిపి ఉంచకుండా జాగ్రత్త పడాలి.
  • బంగారం కొనుగోలు, పండుగ షాపింగ్ వివరాలను బహిరంగంగా ప్రచారం చేయకుండా ఉండాలి.
  • ఇంట్లో పనిచేసే వారి వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్‌లో వెరిఫికేషన్ చేయించుకోవాలి.
  • ప్రయాణానికి ముందు ఇంటి ఫోటోలు, విలువైన వస్తువుల వివరాలను భద్రంగా నమోదు చేసుకుని ఉంచుకోవడం మంచిది.
  • అపార్ట్మెంట్లు, కాలనీల్లో వాచ్‌మన్‌లను అప్రమత్తం చేసి గేట్లు సరిగా మూసేలా చూడాలి.
  • అద్దె ఇళ్ల యజమానులు ఖాళీగా ఉన్న ఇళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి.
  • ఇంటి బయట గేటుకు ఎక్కువ రోజుల పాటు తాళం వేస్తే ఇంట్లో ఎవరూ లేరనే అనుమానం దొంగలకు కలగవచ్చునని గుర్తుంచుకోవాలి.

జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ ప్రత్యేక బందోబస్తు చర్యలు, నైట్ పెట్రోలింగ్ కొనసాగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజలు పోలీస్ శాఖకు పూర్తిస్థాయిలో సహకరించాలని, ఏదైనా అనుమానాస్పద సమాచారం గమనించిన వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.

ప్రతి ఒక్కరూ పై సూచనలు పాటిస్తూ, పోలీస్ యంత్రాంగానికి సహకరిస్తూ, నల్లగొండ జిల్లాను నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!