నల్గొండ:
నల్గొండ మండలం దొనకల్ గ్రామంలో ₹3 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను రాష్ట్ర రోడ్లు, భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సబ్స్టేషన్ ప్రారంభంతో దొనకల్తో పాటు పరిసర గ్రామాలకు మెరుగైన, నిరంతర విద్యుత్ సరఫరా అందుబాటులోకి రానుంది. దీని ద్వారా వ్యవసాయ రంగానికి అవసరమైన విద్యుత్ సరఫరా మరింత బలపడనుండగా, పరిశ్రమలు మరియు గృహ వినియోగదారులకు కూడా నాణ్యమైన విద్యుత్ అందే అవకాశం ఏర్పడింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామీణాభివృద్ధిలో విద్యుత్ కీలక పాత్ర పోషిస్తుందని, అన్ని రంగాల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments