స్థానిక శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయంలో 07-01-2026 (బుధవారం) నాడు 179వ శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ త్యాగరాజ స్వామి వారు రచించి గానం చేసిన వేలాది కీర్తనల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పంచరత్న కీర్తనలను శ్రీ P. రవిశంకర్, శ్రీమతులు NC పద్మ, జానకి రామనాథన్, గోవర్ధనం మానస, NV జానకి, గరిమెళ్ళ శ్వేత ఎంతో మధురంగా ఆలపించారు.
హైదరాబాద్ నుండి విచ్చేసిన శ్రీ N. హరికృష్ణ మృదంగ వాయిద్యంతో, శ్రీ లొల్ల అభిరామ్ మరియు శ్రీ ఆకెళ్ళ శ్యామ్ వయోలిన్తో, శ్రీ మూర్తి రిధమ్స్తో కళాకారులకు సహకారం అందించారు.
శ్రీ M.P. ఆచార్య పర్యవేక్షణలో నిర్వహించిన ఈ ఆరాధనోత్సవం రెండు గంటల పాటు సాగింది.
కార్యక్రమం ముగింపు సందర్భంగా కళాకారులకు శ్రీ శ్రీ శ్రీ రామచంద్ర జీయర్ స్వామి మంగళాశాసనాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో త్యాగరాజ ఉత్సవ సమితి అధ్యక్షులు M. జనార్దనా చార్య, రామగిరి దేవాలయ మాజీ చైర్మన్ చకిలం వేణుగోపాల రావు, ముడుంబ లక్ష్మినాథ్, అనంతా చార్యులు, అక్కినేపల్లి శ్రీనివాస రావు, ప్రసాదరావు, రమాదేవి, జానకి తదితరులు పాల్గొన్నారు.
ఈ సంగీత కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించిన దాతలకు సమితి అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు.
అంతకు ముందు శ్రీ త్యాగరాజ స్వామి వారి పటంతో దేవాలయ ప్రాంగణంలో నగర సంకీర్తనం, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మంగళం, ప్రసాద వితరణతో ఆరాధనోత్సవం ఘనంగా ముగిసింది.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments