మున్సిపల్ ఎన్నికల అవగాహన సమావేశం
చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో పురపాలక సంఘం కార్యాలయంలోనీ సమావేశ మందిరంలో 07-01-2026 బుధవారం రోజున
మున్సిపల్ 2,వ సాధారణ ఎన్నికల అవగాహన సమావేశం నిర్వహించారు. ఇట్టి సమావేశంలో
మున్సిపల్ ఎన్నికల ప్రత్యేక అధికారి గౌరవ RDO, శ్రీ V.శేఖర్ రెడ్డి గారు మరియు మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రాం రెడ్డి* పాల్గొన్నారు.
అట్టి సామావేశంలో వార్డు ఆఫీసర్స్ బిల్ కలెక్టర్స్,అంగన్ వాడీ టీచర్లు,ఆశ వర్కర్లు, BLO లు,ఆర్.పి.లు మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. వారికి ముసాయిదా ఓటర్ జాబితాలో క్షేత్రస్థాయిలో వచ్చే సమస్యలను వివరిస్తూ సందేహాలను గౌరవ ఆర్డీవో గారు నివృత్తి చేయడం జరిగింది. అందరూ కలిసికట్టుగా పనిచేసి ఎలక్షన్ నిర్వహణ బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఆదేశించడం అయినది. గౌరవ కమిషనర్ గారు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి రాజకీయాలకు అతీతంగా పని చేసి ఈ ఎలక్షన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని కోరినారు.
ఈ కార్యక్రమంలో మేనేజర్ డి,శ్రీధర్ రెడ్డి,RO అంజయ్య,Ri దీప సీనియర్ అసిస్టెంట్ రఘుపతి,SI హనుమాన్ ప్రసాద్, EE రేణు కుమార్ తదితరులు పాల్గొన్నారు
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments