మిర్యాలగూడ పట్టణంలో వరుసగా వెలుగుచూస్తున్న ఆడ గర్భస్థ శిశు మృతదేహాలు స్థానికుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి.
తాజాగా షాబునగర్ ప్రాంతంలో డ్రైనేజీ పక్కన ఆరు నెలల ఆడ గర్భస్థ మృత శిశువు మృతదేహాన్ని పారిశుద్ధ కార్మికులు గుర్తించారు.
ఈ సంఘటనకు రెండు నెలల క్రితం విద్యానగర్ సబ్ జైల్ రోడ్ ఏరియాలో కుక్క నోట్లో ఆడ గర్భస్థ శిశు మృతదేహం లభించడం మరింత కలకలం రేపింది.
తల్లి గర్భంలోనే ఆడ శిశువులను హతమారుస్తున్నారన్న అనుమానాలతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఇలాంటి అమానవీయ ఘటనలపై పోలీసు, వైద్య–ఆరోగ్యశాఖ అధికారులు కేవలం చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అక్రమంగా అబార్షన్లు చేస్తున్న డాక్టర్లను గుర్తించి సస్పెండ్ చేసి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట పడుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
👉 పోలీసులు ఈ ఘటనపై వెంటనే దృష్టి సారించి, నేరస్తులను పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments