
పుట్టపర్తి సాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి నల్లగొండ పట్టణంలో సత్యసాయి ప్రేమ వాహిని రథయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పుట్టపర్తి నుండి అందంగా అలంకరించిన వాహనంలో సాయిబాబా చిత్రపటాన్ని నెలకొల్పి వివిధ జిల్లాలు తిరుగుతూ నల్లగొండ జిల్లాలో మంగళవారం ఉదయం ప్రవేశించింది. ఈ సందర్భంగా భక్తులు రధ యాత్రకు మంగళ హారతులతో స్వాగతం పలుకుతు సాయిబాబా ఆలయానికి తీసుకువచ్చారు,అనంతరం వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి నల్లగొండలోని ప్రధాన వీధుల గుండా పాదయాత్రను కోలాటాలు భజనలు కీర్తనలతో ఊరేగించారు, పట్టణ ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతూ సాయిబాబాని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ కన్వీనర్ విశ్వేశ్వర్,తుకారం, మురళీధర్,మదన్మోహన్, మల్లికార్జున్రెడ్డి, కవిత, దేవి, లకుమారపు శ్రీనివాస్, గోవింద బాలరాజ్,సందీప్ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు.

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments