నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణపై పార్టీ హైకమాండ్ తీవ్రంగా స్పందించింది. వాజ్పేయి జయంతి వేడుకల సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి సమక్షంలోనే నాయకుడు పిల్లి రామరాజుపై జరిగిన దాడిని రాష్ట్ర నాయకత్వం చాలా సీరియస్గా తీసుకుంది.
ఈ ఘటన వల్ల పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిందని భావించిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు, నాగం వర్షిత్ రెడ్డిని పిలిపించి మందలించినట్లు సమాచారం. పార్టీ క్రమశిక్షణకు భంగం కలిగించే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆయన హెచ్చరించినట్లు తెలుస్తోంది.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments