నల్గొండ:
సోలార్ విద్యుత్ రంగంలో ప్రముఖ సంస్థ అయిన సుంటెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని ట్రూజోన్ సోలార్ సంస్థ నల్గొండలో తమ నూతన షోరూమ్ను డిసెంబర్ 28, 2025న సాయంత్రం 4 గంటలకు ఘనంగా ప్రారంభించనుంది.
ఈ ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర రహదారులు & భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ గౌరవ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
అలాగే ట్రూజోన్ సోలార్ సీఈఓ శ్రీ శ్రీనివాస్ జక్కుల గౌరవ అతిథిగా పాల్గొననున్నారు.
నూతన షోరూమ్ వివేకానంద విగ్రహం సమీపంలో, అపోలో ఫార్మసీ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నల్గొండలో ఏర్పాటు చేయబడింది.
ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, నల్గొండ జిల్లాలో సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించడం, తక్కువ ఖర్చుతో నాణ్యమైన సోలార్ పరిష్కారాలను అందించడం తమ లక్ష్యమని తెలిపారు.
ఈ షోరూమ్ను సుంటెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారిక ఛానల్ పార్ట్నర్ అయిన శ్రీ కృష్ణ సివిల్ & ఎలక్ట్రికల్ వర్క్స్ సహకారంతో ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి ప్రజలు, వ్యాపారవేత్తలు, వినియోగదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments