నల్గొండ జిల్లా బీజేపీ రాష్ట్ర నేత పిళ్లి రామరాజు యాదవ్పై జరిగిన దాడిని యాదవ మరియు బీసీ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ ఘటనకు నిరసనగా నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
ఆందోళనలో భాగంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి దిష్టిబొమ్మను (తిరగేసి) దగ్ధం చేశారు. నాగం వర్షిత్ రెడ్డిని జిల్లా బీజేపీ పదవి నుంచి వెంటనే సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు.

బీసీ సంఘాల నాయకులు క్లాక్ టవర్ సెంటర్ను దిగ్బంధించడంతో కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఒకే పార్టీలో ఉన్న నేతపై భౌతిక దాడి చేయడం హాస్యాస్పదం, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. నల్గొండ టూ టౌన్ ఎస్ఐ సైదులు జోక్యం చేసుకొని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఆయన హామీతో ఆందోళన శాంతియుతంగా ముగిసింది, అనంతరం ట్రాఫిక్ సాధారణ స్థితికి వచ్చింది.

ఈ సందర్భంగా మాట్లాడిన యాదవ–బీసీ సంఘాల నాయకులు నాగం వర్షిత్ రెడ్డి యాదవ సమాజానికి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
యాదవ సంఘం జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పిళ్లి రామరాజు యాదవ్కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనతో నల్గొండ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. పార్టీ క్రమశిక్షణను కాపాడేందుకు బీజేపీ అధిష్ఠానం వెంటనే జోక్యం చేసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments