e-paper
Friday, January 30, 2026

ఆర్టీసీ కాలనీలో ఘనంగా 25వ మహా పడిపూజ మహోత్సవం

41 రోజుల నిత్య అన్నప్రసాద వితరణ ముగింపు కార్యక్రమం నిర్వహణ

నల్గొండ:

ఆర్టీసీ కాలనీలో గురుస్వామి నారాయణదాసు వెంకన్న ఆధ్వర్యంలో నిర్వహించిన 41 రోజుల నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా శ్రీశ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి 25వ మహా పడిపూజ మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజతో పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా భక్తులకు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొని స్వామివారి దర్శనంతో పుణ్యం పొందారు.

ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా టూ టౌన్ ఎస్ఐ సైదులు గౌడ్, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య, 14వ వార్డు మాజీ కౌన్సిలర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి కవిత, కన్నె స్వామి నాగరాజుతో పాటు పలువురు అయ్యప్ప స్వాములు, భక్తులు హాజరయ్యారు.

కార్యక్రమం ప్రశాంతంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో ముగిసిందని నిర్వాహకులు తెలిపారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!