2000,2001 వివేకానంద విద్యా మందిర్ 10వ తరగతి విద్యార్థులు గురువారం స్థానిక మనోహర హోటల్లో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆనాటి మధుర స్మృతులను జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఒకరికొకరు పరిచయం చేసుకొని క్షేమ సమాచారం తెలుసుకున్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ ఉద్యోగాలలో స్థిరపడ్డారు కుటుంబ పరిస్థితులు పిల్లల పరిస్థితిలు తెలుసుకొని సంబరపడ్డారు. ఆనాటి చిలిపి పనులను నెమరు వేసుకున్నారు. అనంతరం ఆనాటి ఉపాధ్యాయులైన బుచ్చిరెడ్డి, వేణుగోపాలరావు, వెంకటరెడ్డి,కరుణాకర్ రెడ్డి, రుక్మారెడ్డి లను,శాలువాలతో పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అన్వేష్, మహేష్, రమేష్, నాగార్జున రెడ్డి, లింగస్వామి, దీప్తి, సుకన్య, సరిత, లలిత, రజిత తదితరులు పాల్గొన్నారు
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments