నిజామాబాద్ | క్రైమ్ న్యూస్:
నిజామాబాద్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా ముఠా చేసిన దుస్సాహస చర్య కలకలం రేపింది. కారులో గంజాయి తరలిస్తున్న ముఠాను అడ్డుకునే ప్రయత్నం చేసిన కానిస్టేబుల్ సౌమ్యను, ముఠా సభ్యులు కారుతో ఢీకొట్టి పారిపోవడానికి యత్నించారు.
వివరాల ప్రకారం.. తన విధుల్లో భాగంగా అనుమానాస్పదంగా కదులుతున్న కారును ఆపేందుకు కానిస్టేబుల్ సౌమ్య ప్రయత్నించారు. అయితే గంజాయి తరలిస్తున్న విషయం బయటపడుతుందనే భయంతో ముఠా సభ్యులు సౌమ్యపై కారును దూసుకెళ్లించి ఢీకొట్టి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు.
ఈ ఘటనలో కానిస్టేబుల్ సౌమ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆమెను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై అప్రమత్తమైన పోలీసులు వేగంగా స్పందించి గంజాయి ముఠా సభ్యులను అరెస్టు చేశారు. కారులోని గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
పోలీసు విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడి చేయడంపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments