నల్గొండ:
నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం పోలీసు సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలను కాపాడుతూ ప్రజల భద్రతకు అంకితభావంతో పని చేయడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యం అని తెలిపారు.
ప్రజల విశ్వాసాన్ని కాపాడుతూ, చట్ట పరిరక్షణలో పోలీస్ సిబ్బంది మరింత నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందికి, జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఆర్ఐలు, పోలీస్ అధికారుల సంఘ ప్రతినిధులు మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments