చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి గ్రామంలో డ్రైనేజీలో పెద్ద ఎత్తున ఓటు స్లిప్స్ బయటపడటం రాజకీయ కలకలం రేపింది. డ్రైనేజీ నీటిలో కొట్టుకుపోతున్న స్లిప్స్పై బీఆర్ఎస్ బలపరిచిన కత్తెర గుర్తుకు ఓటు వేసినట్లు ఉండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనపై సంబంధిత ఎన్నికల సహాయక అధికారికి అలాగే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.
⚖️ ఎన్నికల ఫలితాల తర్వాత వివాదం
నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో
కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి 455 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని ఓడించి గెలుపొందారు.
అయితే, ఈ ఫలితాలను అంగీకరించలేమంటూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి రుద్రారపు బిక్షం తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, తమకు చెందిన ఓటు స్లిప్స్ను కావాలనే డ్రైనేజీలో పడేశారని ఆయన ఆరోపించారు.
🚨 దర్యాప్తు కోరుతున్న స్థానికులు
ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు మరియు బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఘటనను సీరియస్గా తీసుకుని పరిశీలిస్తున్నట్లు సమాచారం.


Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments