e-paper
Friday, January 30, 2026

పుస్తక పఠనం ప్రతి ఒక్కరి అలవాటుగా మారాలి – జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా. ఎం.ఏ. హఫీజ్ ఖాన్

58వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నేడు నిర్వహించిన పుస్తక ప్రదర్శనను జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ ప్రారంభించారు. సరస్వతి చిత్రపటానికి పూలమాల వేసి ప్రార్థనలు చేసిన అనంతరం ప్రదర్శనను సందర్శించారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా. ఎం.ఏ. హఫీజ్ ఖాన్—

పుస్తక పఠనం ద్వారా లభించే ప్రత్యక్ష అనుభవం మనలో అపారమైన జ్ఞానం, ఆలోచన, అనుభూతిని కలిగిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు.

జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ మాట్లాడుతూ—

ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలంటే గ్రంథాలయంలో లభించే పుస్తకాలు గొప్ప మార్గమని, గ్రంథాలయాన్ని ఒక జ్ఞానాలయంగా భావించి దీన్ని పూర్తిగా వినియోగించుకోవాలని పాఠకులను కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బాలమ్మ, మాజీ చైర్మన్ వినోద్ రెడ్డి, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!