నల్గొండలోని స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ 58వ జయంతి ఉత్సవాలను స్వేరోస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు నర్ర నిర్మల, నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఫెరోస్ రాష్ట్ర కో-కన్వీనర్ అనుముల సురేష్ స్వేరో మరియు సీనియర్ స్వేరోస్ పాల్గొన్నారు.

కేక్ కటింగ్ అనంతరం, నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు మరియు స్వేరో న్యాప్కిన్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో వారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను అభినందిస్తూ, “ఎంతో మంది నిరుపేద విద్యార్థులను ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వేరోలు మరియు అభిమానులు హాజరయ్యారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments