e-paper
Thursday, January 29, 2026

నల్గొండలో అభివృద్ధి సమస్యలపై కేంద్ర మంత్రికి వినతి పత్రం సమర్పణ

నల్గొండ పట్టణంలోని పెద్దబండ, గొల్లగూడ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలన్నడిమంగా, బీజేపీ రాష్ట్ర నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ గారి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రివర్యులు శ్రీ ప్రహ్లాద్ జోషి గారికి ఒక వినతిపత్రం సమర్పించబడింది.

📝 వినతిపత్రంలో ప్రధానంగా కోరిన అంశాలు:

పెద్దబండ–గొల్లగూడ ప్రాంతంలో రైల్వే అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణం అద్దంకి బైపాస్ వద్ద మరో అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణం ఎఫ్‌సీఐ గోదాంలో కొన్ని ఏళ్లుగా శానిటరీ వర్కర్లగా పనిచేస్తున్న మహిళలను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించడం

ఈ సమస్యలు సంవత్సరాలుగా పరిష్కారం లేని నేపథ్యంలో, స్థానిక ప్రజలకు తక్షణ ఉపశమనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని పిల్లి రామరాజు యాదవ్ గారు కేంద్ర మంత్రివర్యులను అభ్యర్థించారు.

👉 కేంద్ర ప్రభుత్వం స్పందించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే స్థానిక ప్రజల నుండి సంపూర్ణ సహకారం అందుతుందని ఆయన పేర్కొన్నారు.

🔹 స్థానిక ప్రజలు ఈ వినతిపత్రం ద్వారా తమ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!