నల్గొండ, నేడు
13వ వార్డు విద్యుత్ నగర్లో చిన్నారుల శుభ్రత కోసం ప్రత్యేకంగా సబ్బుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నల్గొండ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు శ్రీ గుమ్ముల మోహన్ రెడ్డి గారు హాజరై, అంగన్వాడి స్కూల్ పిల్లలకు స్వయంగా సబ్బులను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ప్రసంగిస్తూ శ్రీ మోహన్ రెడ్డి గారు, పిల్లల ఆరోగ్యం కోసం పరిశుభ్రత ఎంతో అవసరమని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సామాజిక సేవ మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు అంకితంగా ఉందని తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యులు:
అంగన్వాడి స్కూల్ PD, సూపర్వైజర్, INTUC యూనియన్ అధ్యక్షులు శ్రీ మైనుద్దీన్, విద్యుత్ నగర్ కాలనీ కాంగ్రెస్ ఇన్చార్జ్ కంచరకుంట్ల వెంకటరెడ్డి, ఏదుళ్ల శ్రీధర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, మామిడి కార్తీక్, గాలి నాగరాజు, కత్తుల రాంబాబు, ఉమారాణి, శ్వేత, శ్రీలత, మాధవి, అనుష, ఝాన్సీ, నిమ్మనగోటి రమేష్, బొజ్జ వెంకన్న, కాసోజు రమేష్, చెరుపల్లి మురళి, రమేష్ గౌడ్, గుజ్జుల నాగిరెడ్డి, పాస్తాం శీను, పెద్ద లింగయ్య, చిన్న లింగయ్య, కోటయ్య మరియు ఇతర కాలనీవాసులు.
నేతలు భవిష్యత్తులో ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments