నల్గొండ:
కేశరాజుపల్లి, మూడవ వార్డు పాతపల్లి గ్రామానికి చెందిన బుక్ కీపర్ లింగంపల్లి వాహిని (RP) గత కొంతకాలంగా మహిళా సంఘాలకు సంబంధించిన 12 సంఘాల పేరుపై డ్వాక్రా రుణాలను మంజూరు చేయించే బాధ్యతలు నిర్వహించారు. ఈ ప్రక్రియలో ఆమె మహిళల ఆధార్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు, మరియు ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లు తీసుకుని తన వద్ద ఉంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ సమయంలో ICICI బ్యాంక్ ఫీల్డ్ అసిస్టెంట్లైన మహేష్, కృష్ణలతో కుమ్మక్కై మొత్తం ₹1.50 కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసినట్టు మహిళలు ఆరోపిస్తున్నారు. సంబంధిత డాక్యుమెంట్లపై నకిలీ సంతకాలు చేసి ఫోర్జరీ చేసిన విషయంపై మహిళలు బ్యాంక్ మేనేజర్ను సంప్రదించగా, ఆ ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లు ఇప్పటికే ఉద్యోగాలకు రాజీనామా చేసి పారిపోయారని అధికారులు తెలిపారు.
ఈ అంగీకారంతో ఆగ్రహించిన బాధిత మహిళలు,
“కూలి తిని కుటుంబాలు నెట్టుకురుస్తున్న మేము… మా పేరుతో కోట్లాది రూపాయలు మోసం చేశారు. బుక్ కీపర్ వాహిని, ఫీల్డ్ అసిస్టెంట్లపై వెంటనే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధరణీ నిర్వహించారు.
న్యాయం చేయాలని కోరుతూ జరిగిన ఈ నిరసనలో సావిత్రమ్మ, ఎల్లమ్మ, అందాలు, కోటమ్మ, సరోజ, సోమమ్మతో పాటు అనేక మంది మహిళలు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments