నల్లగొండ:
రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, బిజెపి మరియు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నల్లగొండ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష నిర్వహించబడుతోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ యన్. రామచందర్ రావు ఆదేశాల మేరకు ఈ దీక్షను చేపట్టినట్లు పార్టీ నాయకులు తెలిపారు.

రైతుల ప్రధాన డిమాండ్లలో సన్న వడ్లకు బోనస్ చెల్లింపు, ఫసల్ భీమా అమలు, ధాన్యం కొనుగోలు పై ఆంక్షలు లేకుండా కొనుగోళ్లు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఉన్నాయి.

దీక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బస్వా లక్ష్మీ నర్సయ్య, నల్లగొండ బిజెపి జిల్లా అధ్యక్షులు డా. నాగం వర్శిత్ రెడ్డి, యాదాద్రి జిల్లా బిజెపి అధ్యక్షులు ఊట్కూరి అశోక్ గౌడ్, సూర్యాపేట జిల్లా బిజెపి అధ్యక్షురాలు చల్లా శ్రీలతా రెడ్డి హాజరవుతున్నారు.
ఈ నెల 17వ తేదీ ఉదయం 10 గంటల నుండి 18వ తేదీ ఉదయం 11 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. రాష్ట్ర, జిల్లా, మండల, పట్టణ స్థాయి బిజెపి మరియు కిసాన్ మోర్చా నాయకులు, కార్యకర్తలు దీక్షలో పాల్గొనాలని నాయకులు కోరుతున్నారు.
ఈ కార్యక్రమాన్ని బిజెపి కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి సమన్వయం చేస్తున్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments