నల్గొండలోని ఎస్ ఎల్ బీసీ ప్రాంతంలో ఉన్న నీలగిరి ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆదివారం ధ్వజారోహణతో మండల పూజలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలను చూడటానికి వందలాది మంది అయ్యప్ప స్వాములు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

స్వాములు సంప్రదాయ పద్ధతిలో పూజలు, నైవేద్యాలు నిర్వహించగా, ఆలయ పరిసరం భక్తి శ్రద్ధలతో కళకళలాడింది. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బీరవెల్లి గోపాల్ రెడ్డి, బాలయ్య, అర్చకులు పెన్నా సుబ్రహ్మణ్య శాస్త్రి, మాజీ కౌన్సిలర్ చిన్నాల అలివేలు జానయ్య, కందికొండ శ్రీనివాస్, ఆమనగంటి బిక్షా రెడ్డి, కంజర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments