నల్గొండ పట్టణంలోని తులసీనగర్లో ఉన్న భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం హనుమత్ గాయత్రీ మహా యజ్ఞం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

యజ్ఞం ఆరంభంలో స్వామివారి పూజ ఉత్సవ అనుజ్ఞ, విజ్ఞేశ్వర పూజ, శైవ శుద్ధి, మహా పుణ్యాహవాచనం, మంటపార్చన, మహాలక్ష్మి పూజ, పంచామృత అభిషేకం, విశేషాలంకరణ, అష్టోత్తర, నాగవెల్లి దళార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అగ్ని ప్రతిష్ఠాపన, గణపతి, నవగ్రహ, మాన్యుసూక్త హోమాలు, తరువాత ప్రధానంగా హనుమత్ గాయత్రీ మహా యజ్ఞం నిర్వహించారు.
యజ్ఞం ముగింపులో పూర్ణాహుతి, నీరాజనం, మంత్రపుష్పాలు, అనంతరం తీర్థ ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి కళాసిక కుశలయ్య, అర్చకులు పోతులపాటి శివప్రసాద్ శర్మ, గంగాపురం హరీష్ శర్మ, వంగిపురం హనుమంత ఆచార్యులు, ఆలయ సిబ్బంది శేఖర్, గోదాదేవి శీను, గురుస్వాములు ప్రభాకర్ రెడ్డి, కత్తుల జగన్, పూజిత శీను, బద్రు నాయక్, జగన్, కృష్ణ, బిక్షం, విష్ణు, నరేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments